News

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

340views

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నేడు (శుక్రవారం) స్వామివారిని దర్శించుకునేందుకు 26 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. గురువారం శ్రీవారిని 67,511 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. 26,948 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. నిన్న స్వామివారి హుండీ ఆదాయం రూ.4.33 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది.