
350views
మధ్యప్రదేశ్లో ఘోర ప్రమాదం జరిగింది. రీవా నగరంలోని ఎయిర్స్ట్రిప్పై ఓ ట్రైనింగ్ ప్లేన్ కూలిపోయింది. పైలట్ మృతి చెందాగ.. ట్రైనీ తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి వచ్చారు. అనంతరం వారిద్దరిని ఆస్పత్రికి తరలించారు. పైలట్కు తీవ్ర గాయాలు కావడం వల్ల పరిస్థితి విషమించి చికిత్స పొందుతూ మృతిచెందాడు. చోర్హటా పోలీస్స్టేషన్ పరిధిలోని ఉమ్రీ గ్రామంలో ఓ ఆలయ గోపురానికి ప్లేన్ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. ఘటనాస్థలికి అధికారులు చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ప్లేన్ పల్టాన్ ట్రెనింగ్ కంపెనీకి చెందినదిగా గుర్తించారు.





