News

కీలక మలుపులు తిరుగుతున్న కర్ణాటక బాంబు పేలుడు కేసు

425views

మంగుళూరు: కర్ణాటక మంగళూరులో శనివారం జరిగిన ఆటో పేలుడు ఘటనలో సంచలన విషయాలు బయటికి వస్తున్నాయి. ఆటోలో వెళ్లిన ప్రయాణికుడే పేలుడుకు కారణమని భావిస్తున్న పోలీసులు.. ఇందులో ఉగ్రకోణం ఉందని ప్రాథమికంగా నిర్ధారించారు. ఘటనా స్థలంలో ప్రెజర్ కుక్కర్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. కేంద్ర సంస్థలతో కలిసి ముమ్మరంగా శోధిస్తున్నారు. ప్రెజర్‌ కుక్కర్‌లో డిటోనేటర్లు, వైర్లు, బ్యాటరీలు ఉన్నాయని.. ఆ పేలుడు ధాటికి ఆటో మెుత్తం కాలిపోయినట్టు తెలిపారు. ఆటోలో ప్రయాణించిన వ్యక్తి వద్ద దొరికిన ఆధార్‌ కార్డు నకిలీదని గుర్తించిన పోలీసులు.. అసలు వ్యక్తి హుబ్బళ్లి వాసిగా తేల్చారు. అతడిని విచారణ జరపగా.. తన ఆధార్‌ కార్డు పోయిందని.. వారితో తనకు ఏ సంబంధం లేదని చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి