News

పాక్​ వలపు వలలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి!

369views

న్యూఢిల్లీ: వలపు వలలో చిక్కుకుని పాకిస్తాన్‌కు దేశ రహస్యాలు చేరవేస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్​ చేశారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖలో డ్రైవర్​గా పనిచేసే ఓ వ్యక్తి పాక్ వలపు వలలో చిక్కుకున్నట్టు నిఘా వర్గాలు గుర్తించాయి. అయితే, అతడిని పాకిస్తాన్‌కు చెందిన గూఢచార సంస్థ.. ఇంటర్ సర్వీసెస్ ఇంటిలిజెన్స్ హనీట్రాప్​ చేసిందని తెలిపారు. పక్కా సమాచారంతో ఢిల్లీ పోలీసులు.. భద్రతా దళాల సాయంతో అతన్ని అరెస్ట్​ చేశారు. ప్రస్తుతం నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి