News

తనపై దాడికి పాక్ ప్రధాని, మరో ఇద్దరు బాధ్యులన్న ఇమ్రాన్ ఖాన్

186views

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌ ప్రస్తుత ప్రధాని హెహబాజ్‌ షరీఫ్‌ సహా మరో ఇద్దరు తనపై దాడికి పాల్పడ్డారని ఇమ్రాన్‌ఖాన్‌ ఆరోపించారు. ఈ మేరకు పాకిస్తాన్‌ తెహ్రీక్‌ -ఇ-ఇన్సాఫ్‌ (పిటిఐ) పార్టీ సీనియర్‌ నేత అసద్‌ ఉమర్‌ గురువారం అర్థరాత్రి ప్రకటించారు. షరీఫ్‌తో పాటు అంతర్గత మంత్రి సనావుల్లా, మేజర్‌ జనరల్‌ ఫైసల్‌ నజీర్‌ దాడికి బాధ్యులని పేర్కొన్నారు.

షరీఫ్‌ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ గురువారం రాత్రి తూర్పు పాకిస్తాన్‌లోని వజీరాబాద్‌ అల్లావాలా చౌక్‌లో పాదయాత్రలో భాగంగా ట్రక్కుపై నిల్చొని మాట్లాడుతుండగా గుర్తు తెలియని ఆగంతకుడు తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఇమ్రాన్‌ రెండు కాళ్ళకు బుల్లెట్‌ తగిలి గాయమైంది. పీటీఐ పార్టీకి చెందిన పలువురికి గాయాలయ్యాయి. చికిత్స కోసం వీరిని లాహోర్‌ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఇమ్రాన్‌ ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని ప్రధాని మాజీ ఆరోగ్య శాఖ కార్యదర్శి ఫైజల సుల్తాన్‌ పేర్కొన్నారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి