News

నందిగామలో ఘనంగా ఏకాదశ రుద్రాభిషేకం

378views

నందిగామ: ఎన్టీఆర్ జిల్లా నందిగామలో శ్రీ సత్య సాయి బాబా మందిరంలో శ్రీ సత్యసాయి సేవా సంస్థలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వేదా అధ్యయన విభాగం ఆధ్వర్యంలో మహాన్యాస పూర్వక ఏకాదశి రుద్రాభిషేకం ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర సత్యసాయి వేద విభాగం ఇంచార్జ్ హరి ప్రసాద్ శర్మ పరివేక్షణలో 40 మంది వేద పండితులు రుద్రాభిషేకాన్ని వేద మంత్రోత్సవంతో ఘనంగా నిర్వహించారు. ప్రపంచ శాంతి లోక కల్యాణాన్ని ఉద్దేశించి రుద్రాభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం అన్నదానం నిర్వహించారు. పెద్ద సంఖ్యలో మహిళా భక్తులు తరలివచ్చారు. ఆధ్యాయంతో వేద మంత్రోత్సవాల మధ్య రుద్రాభిషేకం కన్నుల పండుగ నిర్వహించారు. శ్రీ సత్యసాయి సేవా సంస్థల కన్వీనర్ వాసుదేవరావు, తదితరులు ఏకాదశి రుద్రాభిషేకం కార్యక్రమంలో పాల్గొన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి