
463views
అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా భక్తులు శనివారం భక్తిశ్రద్ధలతో నాగుల చవితి ఉత్సవాలను జరుపుకొన్నారు. నాగదేవతలకు పూజ చేసి, తమ మొక్కులు తీర్చుకున్నారు. కొన్ని పట్టణాల్లో పుట్టలు లేకపోయినప్పటికీ దగ్గరలోని ఆలయాల్లో ఉన్న నాగప్రతిమలకు పాలు పోయడానికి భక్తులు పోటెత్తారు. ఈ తెల్లవారుజాము నుంచి చలివిడి చిమ్మిలి, ఆవు పాలు తదితర పూజావస్తువులతో భక్తులు శివాలయాల్లో బారులు తీరారు. పల్లెప్రాంతాల్లో కాలువ గట్టుమీద ఉన్న పుట్టలను భక్తులు ఆశ్రయించారు.





