
364views
శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వరాలయంలోని మహానంది విగ్రహానికి చెన్నైకి చెందిన భక్తుడు వెండి కవచాన్ని కానుకగా అందజేశారు. రూ.25లక్షల వ్యయం తో 30కేజీల వెండి కవచాన్ని చెన్నైకి చెందిన జై మురుగన్ బహూకరించారు. శ్రీ గురుదక్షిణామూర్తి సన్నిధిలో వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య వెండి కవచనానికి పూజలు చేశారు. అనంతరం శాస్త్రోక్తంగా మహానంది విగ్రహానికి తొడిగారు. ఆలయం తరఫున దాతలను అధికారులు సత్కరించారు.





