News

క్రీడల్లో నైతికత పెరగాలి… రవిశంకర్ గురూజీ ఉద్బోధ

323views

బెంగళూరు: క్రీడలు యుద్ధాలవలే, యుద్ధాలు క్రీడలవలే జరుగుతున్నాయని గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్ అన్నారు. క్రీడల్లో నైతికత పెరగాలని, క్రీడలు మరింత విశ్వసనీయంగా మారాలని ఆయన పిలుపునిచ్చారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థకు చెందిన బెంగళూరులోని అంతర్జాతీయ కేంద్రంలో 6వ ప్రపంచ శిఖరాగ్ర సదస్సు జరిగింది. ‘క్రీడల్లో నైతిక విలువలు.. మానవ సమాజంలో పరస్పర సంబంధాలను పెంపొందించడంలో క్రీడల పాత్ర’ అనే అంశాలపై అక్టోబర్ 13, 14 తేదీల్లో నిర్వహించిన ఈ సదస్సులో పలువురు ప్రముఖులు పాల్గొని ఆసక్తికర వివరాలను పంచుకున్నారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ సోదర సంస్థ ‘వరల్డ్ ఫోరం ఫర్ ఎథిక్స్ ఇన్ బిజినెస్‌’తో సంయుక్తంగా నిర్వహించిన ఈ సదస్సును ఇంటర్నెట్ వేదికగా అంతర్జాతీయంగా వేలాది మంది తిలకించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి