News

దేవదాసి వ్యవస్థను రూపుమాపేందుకు ఏం చర్యలు తీసుకుంటున్నారో చెప్పండి..

306views
  • ఆరు రాష్ట్రాలకు జాతీయ మానవ హక్కుల కమిషన్ నోటీసులు

న్యూఢిల్లీ: భారతదేశంలోని కొన్ని దేవాలయాల్లో కొనసాగుతున్న దేవదాసీ వ్యవస్థను రూపుమాపేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలను తెలపాలంటూ జాతీయ మానవ హక్కుల కమిషన్ కేంద్ర ప్రభుత్వంతో పాటు ఆరు రాష్ట్రాల ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వం తీసుకున్న చర్యలను వివరంగా చెప్పాలని కోరింది.

మీడియాలో వచ్చిన వార్తా కథనాన్ని పరిశీలనలోకి తీసుకుని జాతీయ మానవ హక్కుల కమిషన్ కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్సులకు, కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖకు, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర కార్యదర్శులకు నోటీసులు జారీ చేసినట్టు తెలిపారు. నివేదికను ఆరు వారాలలోగా సమర్పించాలని కోరారు.

“దేవదాసీ విధానాన్ని రూపుమాపేందుకు చాలా చట్టాలను రూపొందించినప్పటికీ ఈ వ్యవస్థ కొనసాగుతోంది. ఈ విధానాన్ని సుప్రీం కోర్టు కూడా విమర్శించింది” అని నోటీసు పేర్కొంది. దేవదాసీ వ్యవస్థ మహిళలను లైంగిక వేధింపులకు గురిచేసి వేశ్యా వృత్తిలోకి నెట్టేస్తోందని అంటూమహిళలు గౌరవప్రదమైన జీవితాన్ని గడిపే హక్కును హరిస్తోందని అంది. దేవదాసీ వ్యవస్థలో పేద, షెడ్యూల్డ్ కులాలు, జాతులకు చెందినవారే ఎక్కువగా ఉన్నట్లు మీడియా నివేదికలో తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి