
344views
టర్కీ: టర్కీ అధ్యక్షుడు ఎర్డొగాస్ మరోసారి భారత్పై తన వక్రబుద్ధిని బయటపెట్టుకున్నాడు. యుఎన్ఒ జనరల్ అసెంబ్లీలో కశ్మీర్ అంశాన్ని లేవనెత్తారు. భారత్-పాకిస్తాన్ మధ్య ఇప్పటి వరకు శాంతి నెలకొనలేదని వ్యాఖ్యానించారు. ఇది దురదృష్టకరమని, కశ్మీర్లో శాంతి నెలకొనాలని ప్రార్థిస్తున్నామని పేర్కొన్నారు. ఈ ఘటనపై భారత్ తీవ్రంగా స్పందించింది. ఇతర దేశాల సార్వభౌమత్వాన్ని గౌరవించడం టర్కీ అధ్యక్షుడు నేర్చుకోవాలని హితవు పలికింది.





