News

18 దేశాలలో మీడియా సంస్థలపై డ్రాగన్ కు‌ పట్టు

254views

* థింక్ ‌ట్యాంక్‌ ‘ఫ్రీడమ్‌ హౌస్‌’ నివేదిక వెల్లడి

నకు వ్యతిరేకంగా ఉండే మీడియాను లొంగదీసుకోవడానికి చైనా తీవ్ర ప్రయత్నాలు చేస్తోందని అమెరికాలోని థింక్ ‌ట్యాంక్‌ ‘ఫ్రీడమ్‌ హౌస్‌’ నివేదిక పేర్కొంది. మీడియా సంస్థలను భయపెట్టి తనకు అనుకూలమైన కథనాలు ప్రచురించేలా చేసేందుకు జిన్ ‌పింగ్‌ సర్కారు చర్యలను తీవ్రతరం చేసిందని ఫ్రీడమ్‌ హౌస్ వెల్లడించింది. ఫ్రీడమ్‌ హౌస్‌ నివేదిక ప్రకారం .. 2019 నుంచి ప్రధాన మీడియాలో చైనా అనుకూల కంటెంట్ ‌ను భారీ ఎత్తున ప్రచారం చేయడం, చైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు, అభిప్రాయాలను ప్రచురించే సంస్థలను బెదిరించడం, సైబర్‌ వేధింపులకు పాల్పడటం, తప్పుడు సోషల్‌ మీడియా ఖాతాలను ఉపయోగించడం, తప్పుడు సమాచారాన్ని ప్రచారంలోకి తీసుకురావడం వంటి పద్దతులను చైనా అమలు చేస్తోంది.

ముఖ్యంగా ఆఫ్రికాలోని 30 ప్రజాస్వామ్య దేశాల్లో 18 చోట్ల మీడియా సంస్థలు చైనా లక్ష్యంగా మారాయి. జిన్ ‌పింగ్‌ ఇమేజ్ ‌ను పెంచేలా కథనాలు రాయాలని వీటిపై డ్రాగన్‌ ప్రభావితం చేస్తోంది. ఈ దేశాల్లోని సోషల్‌ మీడియా, జర్నలిస్టులు, మీడియా సంస్థలు చైనా అనుకూల వాతావరణం ఉండేలా వార్తలు రాయాలని ఒత్తిడి చేస్తోంది. మీడియాను ప్రభావితం చేసేందుకు భారీ ఎత్తున నిధులను కూడా కేటాయించింది. ఇప్పటికే చాలా చోట్ల చైనా అనుకూల మీడియా చానల్స్ ‌ను ప్రారంభించింది. వాటిల్లో చైనా ప్రభుత్వ మీడియా కార్యక్రమాలు ప్రసారం చేస్తోంది. బీజింగ్‌ దీర్ఘకాలంగా మీడియాలో వాస్తవాలు, సమాచారంపై పట్టుకోసం ప్రయత్నిస్తోంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.