News

మాతృభాషలను కాపాడుకోవాలి : అమిత్ షా

417views

నమంతా మన మన మాతృభాషలను రక్షించుకోవాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా విద్యార్థులకు పిలుపునిచ్చారు. గుజరాత్ గాంధీనగర్లో నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీలో ఆయన విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. అందరం మాతృభాషలోనే సంభాషించాలని, మాతృభాషలో చదువుకుంటే ఏ విషయమైనా సులభంగా అవగతమవుతుందని అమిత్ షా అభిప్రాయపడ్డారు.

అందుకే మెడికల్, టెక్నికల్, ఇంజినీరింగ్ కోర్సులను సైతం మాతృభాషలో (స్థానిక భాషల్లో) అందించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. అప్పుడు మనం ఆయా సబ్జెక్టులపై సంపూర్ణ అవగాహనను ఎర్పరచుకోగలుగుతామని అమిత్ షా తెలిపారు. మాతృ భాషను కాపాడుకోవటం ప్రతి విద్యార్థి కర్తవ్యమని ఆయన విద్యార్థులకు ఉద్బోధించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.