
385views
న్యూఢిల్లీ: పాకిస్తాన్ డ్రోన్ను కూల్చివేసేందుకు వైమానిక దళం ప్రత్యేక యాంటీ-డ్రోన్ గన్ని ఏర్పాటు చేసుకుంది. బికనీర్ ఎయిర్ఫోర్స్ స్టేషన్ యాంటీ-డ్రోన్ ఆపరేషన్ కోసం నోడల్ కేంద్రంగా తయారైంది. పాకిస్తాన్ వైపు నుండి డ్రోన్లు తరచుగా గూఢచర్యం, డ్రగ్స్ స్మగ్లింగ్ కోసం భారత సరిహద్దుకు వస్తుండడం విదితమే. వీటి ఆట కట్టించేందుకు ఎప్పటికప్పుడు కేంద్రం కొత్త ప్రణాళికలు రూపొందిస్తోంది.
Source: VSK Jaipur





