
406views
-
విశాఖపట్నంలో ఆవిష్కరించిన శాస్త్రవేత్తలు
విశాఖపట్నం: దేశంలో మంకీపాక్స్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో విశాఖలోని మెడ్టెక్ జోన్లో ఆర్టీపీసీఆర్ టెస్ట్ కిట్ను విడుదల చేశారు. ఎర్బా-ట్రాన్స్ఆసియా సంస్థ తయారు చేసిన ఈ కిట్ను విశాఖ మెడ్టెక్ జోన్లో కేంద్ర ముఖ్య శాస్త్ర సలహాదారు ప్రొఫెసర్ అజయ్ కుమార్ సూద్ విడుదల చేశారు.
మంకీ పాక్స్ వేగంగా విస్తరిస్తోందని.. ఇప్పటికే 75 దేశాలను చుట్టేసిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవలే ప్రకటించింది. మంకీ పాక్స్ను గుర్తించేందుకు ఈ కిట్ను తొలిసారి భారత్లో తయారు చేసి.. మేకిన్ ఇండియాలో భాగస్వాములమయ్యామని సంస్థ వ్యవస్థాపక ఛైర్మన్ సురేష్ వజిరాని వెల్లడించారు. పూర్తిగా దేశీయ సాంకేతికత పరిజ్ఞానంతోనే ఈ కిట్ రూపొందించినట్టు వివరించారు.
Source: Sakshi





