
ఆజాదీకా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా RSS, నేతాజీ యువజన సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో పట్టణంలోని 20 పాఠశాలల విద్యార్ధినీ, విద్యార్ధులకు స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలపై అవగాహానకు చిత్రలేఖనం మరియు వక్తృత్వ పోటీలు నిర్వహించి విజేతలకు 12.8.2022వ తేదీ శుక్రవారం పట్టణంలోని నేతాజీ విగ్రహం వద్ద 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని సభాకార్యక్రమం మరియు బహుమతి ప్రధానోత్సవం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఆర్.యస్.యస్ గుంటూరు విభాగ్ ప్రచారక్ శ్రీ గౌతమ్ పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ సంస్థాపకులు డాక్టర్ జీ చిన్నతనం నుండే స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నారని, ఉద్యమంలో, పోరాటంలో డాక్టర్జీ తన ధైర్య సాహసాలను ప్రదర్శించారని గౌతమ్ అన్నారు. మన దేశం అన్ని రంగాలలో సుసంపన్నమైన దేశం కనుకనే అనేకమంది దురాక్రమణదారులు మన దేశంపై దాడి చేశారని శ్రీ గౌతమ్ తెలిపారు. మన దేశం వెయ్యి సంవత్సరాల బానిసత్వంలో ఉన్నదని, కొన్ని లక్షల మంది బలిదానాల కారణంగా మనకు స్వాతంత్ర్యం సిద్దించిందని అన్నారు.
ఈ కార్యక్రమంలో మునిసిపల్ ఛైర్మన్ షేక్ రఫాని , మునిసిపల్ కమిషనర్ గోవిందరావ్, మార్కెట్ యార్డు ఛైర్మన్ మద్దిరాల విశ్వనాధం, కొమరవల్లిపాడు సొసైటి ఛైర్మన్ తోట బ్రహ్మస్వామి, నేతాజీ యువజన సంఘం నిర్వాహకులు అప్పల లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.





