
మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లా దహనులో ఓ గిరిజన మహిళను బలవంతంగా క్రైస్తవ మతంలోకి మార్చేందుకు ప్రయత్నించినందుకుగానూ నలుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
సరావలిలోని తాలవపాడలో నివాసముంటున్న 50 ఏళ్ల మహిళను ఇద్దరు పురుషులు మరియు ఇద్దరు స్త్రీలు మొత్తం నలుగురు ఆమె ఇంటికి వెళ్లి ఆమెను క్రైస్తవ మతం స్వీకరించమని కోరారు. మతం మార్చుకోవడానికి ఆమెకు డబ్బు కూడా ఇవ్వజూపారు.
క్లామాంట్ బైలా (37), కరియమ్మ ఫిలిప్స్ (53). పింకీ కౌర్ శర్మ (36), పరశురామ్ శింగడ (24) అనే ఆ నలుగురు నిందితులపై భారతీయ శిక్షాస్మృతి కింద మతపరమైన భావోద్వేగాలను రెచ్చగొట్టడం, వివిధ సమూహాల మధ్య శత్రుత్వాన్ని పెంపొందించడం, గృహ ప్రవేశం మరియు ఇతర నేరాల సెక్షన్ల క్రింద కేసు బుక్ చేశారు. నలుగురు నిందితులూ విచారణకు హాజరు కావాల్సిందిగా కోరుతూ వారికి నోటీసులు జారీ చేసినట్లు పాల్ఘర్ పోలీసులు తెలిపారు.





