News

కేరళలో మ‌రో నార్కోటిక్ జిహాద్ కేసు!

473views

తిరువ‌నంత‌పురం: కేరళలో నార్కోటిక్ జిహాద్‌కు సంబంధించిన మరో కేసు నమోదైంది. శనివారం జాయింట్ ఆపరేషన్‌లో, జిల్లా యాంటీ నార్కోటిక్స్ స్పెషల్ యాక్షన్ ఫోర్స్, స్థానిక పోలీసులు గంజాయితో ఒక మహిళతో సహా ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు.

అదుపులోకి తీసుకున్న వారిలో లక్షద్వీప్‌కు చెందిన మహ్మద్ తాహిర్ హుస్సేన్ (24), నావల్ రెహమాన్ (23), సిరాజ్ సీపీ (24), త్రిసూర్‌కు చెందిన అల్తాఫ్ (24) ఉన్నారు. అలప్పుజాకు చెందిన సోనూ సెబాస్టియన్ (23) అనే మహిళ నిందితుల్లో ఒక‌రు.

హిందూ, క్రిస్టియన్ యువతులే ల‌క్ష్యంగా ప‌లువురు జిహాద్‌కు పూనుకుంటున్నారు. పెళ్ళి చేసుకున్న అమ్మాయిలు తర్వాత ఇస్లాం మతంలోకి మారి డ్రగ్స్ మాఫియాల బారిన పడుతున్నారు. పై నిందితుల్లో ఏకైక మహిళ క్రిష్టియ‌న్‌. మిగిలిన వారు ముస్లిం పురుషులు.

ఏప్రిల్‌లో పెళ్ళి చేసుకున్న అజ్నాస్

ఏప్రిల్ 2022లో, కన్నూర్‌కు చెందిన ముహమ్మద్ అజ్నాస్ (24) సెబాస్టియన్‌ను పెళ్ళి చేసుకున్నాడు. లక్షద్వీప్‌కు చెందిన నార్కోటిక్ జిహాదీలకు అతను ఆ మహిళను విక్రయించాడు. వారు తమ మాదకద్రవ్యాలను తరలించడానికి ఆమెను క్యారియర్‌గా ఉపయోగించారు.

అక్బ‌ర్‌.. ఓ లాడ్జిలో ఉంటూ…

లక్షద్వీప్‌కు గంజాయిని స్మగ్లింగ్ చేస్తుండ‌గా అక్బ‌ర్‌ను సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అరెస్టు చేసింది. ఎర్నాకులంలోని ఓ లాడ్జిలో నివాసం ఉంటున్న ఇతర అనుమానితుల వివరాలను నిందితుడు వెల్ల‌డించాడు.

Source: HINDU POST

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి