
437views
లక్నో: లక్షను 10 లక్షలు, కోటిని 10 కోట్లను చేద్దామని అంతా అనుకుంటారు. కానీ దానికి డాక్టర్ అరవింద్ గోయల్ మినహాయింపు.. పేదల కోసం రూ.600 కోట్ల ఆస్తులను రాసిచ్చారు. అంతేకాదు అతనికి ఫ్యామిలీ కూడా అండగా నిలిచింది.
గోయల్ వ్యాపారవేత్త.. వందల కోట్లు సంపాదించారు. అయినా ఎక్కడో వెలితి.. భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నా సరే.. దానం చేయడంలో ఆయనకు ఉన్న సంతోషం మరే దాంట్లో లేదు. పేదలకు దానం చేయాలని ఎప్పుడో నిర్ణయించుకున్నానని.. అదీ ఇప్పటికీ కుదిరిందని చెప్పారు. తన ఆస్తులను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి అందజేశారు. వాటి విలువ రూ.600 కోట్లు అవుతుంది. ఇందుకోసం ఆయన 50 ఏళ్లకు పైగా కష్టపడ్డారు. కానీ ఇప్పుడు పేదలకు చిరు నవ్వుతో అందజేశారు.
Source: NationalistHub





