
భరత్పూర్: రాజస్తాన్లోని భరత్పూర్లోని పసోపా గ్రామంలో అక్రమ మైనింగ్ను వ్యతిరేకిస్తూ నిరసనకు దిగిన బాబా విజయ్ దాస్ అనే హిందూ సన్యాసి నిప్పంటించుకున్నాడు. గత 551 రోజులుగా అక్రమ మైనింగ్కు వ్యతిరేకంగా ఆయన ఇతరులు సాధువులతో కలిసి ఆందోళన చేస్తున్నారు. ఆత్మాహుతి ప్రయత్నంలో, శ్రీ బాబా విజయ్ దాస్ ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పు పెట్టుకుని, ‘రాధే-రాధే’ అని నినాదాలు చేస్తూ పరుగెత్తాడు.
పోలీసులు అతని వెంటే పరిగెత్తారు. మందపాటి దుప్పట్ల సహాయంతో మంటలను ఆర్పారు. బాబాను చికిత్స నిమిత్తం భరత్పూర్లోని రాజ్ బహదూర్ మెమోరియల్ హాస్పిటల్లో చేర్చారు, అక్కడ అతని పరిస్థితి విషమంగా ఉంది. అతనికి 80 శాతం కాలిన గాయాలు తగిలాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇంతలో, అదే ఉద్యమంతో సంబంధం ఉన్న బాబా నారాయణ్ దాస్ అనే మరొక సాధువు 33 గంటల పాటు టవర్పై కూర్చున్నాడు. మంగళవారం ఉదయం ఆరు గంటల నుంచి మొబైల్ టవర్ ఎక్కిన అతడు బుధవారం మధ్యాహ్నం తిరిగి కిందకు వచ్చాడు. అతను బర్సానా నివాసి. ఈ ఆందోళనల దృష్ట్యా, డివిజనల్ కమిషనర్ సన్వర్మల్ వర్మ భరత్పూర్లోని ఐదు పట్టణాల్లో ఇంటర్నెట్ను బంద్ చేశారు.
భరత్పూర్ జిల్లాకు చెందిన డీగ్, కమాన్ తహసీల్ ప్రాంతాలు 84 కోస్ పరిక్రమ మార్గ్లో ఉన్న దృష్యా ప్రజలు పరిక్రమ చేసే మత విశ్వాసానికి సంబంధించిన స్థలం కాబట్టి ఇక్కడ అక్రమ మైనింగ్ను నిలిపివేయాలని నిరసనలు చేస్తున్నారు.
సాధువులకు నాయకత్వం వహిస్తున్న బాబా హరిబోల్ జూలై 17 ఆదివారం ఆత్మాహుతి చేసుకుంటామని హెచ్చరించారు. నా మరణ సమయం ఇప్పుడు నిర్ణయించబడింది.. దానిని ఎవరూ మార్చలేరు. ఎంత మంది పోలీసులను మోహరించినా, జూలై 19 న, బ్రజభూమి రక్షణ కోసం నేను చనిపోతాను. నా చావుకు రాజస్థాన్ ప్రభుత్వమే బాధ్యత వహించాలని హరిబోల్ ముందే హెచ్చరించారు.
Watch। #Rajasthan: A saint named Baba Vijay Das chanting #RadheRadhe set himself on fire to protest the illegal mining in Pasopa village of Bharatpur, Rajasthan.
He, along with other sages and saints, has been agitating for the last 551 days.
@ashokgehlot51 pic.twitter.com/7OEULIph15
— Organiser Weekly (@eOrganiser) July 20, 2022
దీని తరువాత, సోమవారం పర్యాటక మంత్రి విశ్వేంద్ర సింగ్తో సాధువుల సమావేశం జరిగింది. మంత్రి హామీ ఇచ్చిన తర్వాత, బాబా ప్రతి రోజు సమావేశం నిర్వహిస్తున్నారని, కానీ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని నిలదీశారు. సాధువులు కంకంచల్, ఆది బద్రీ పర్వతాలు మత విశ్వాసానికి ప్రతీక అని పేర్కొన్నారు.
రాజస్థాన్ ప్రభుత్వం 27 జనవరి 2005న బ్రజ్ చౌరాసి కోస్ పరిక్రమ మార్గ్కు ఇరువైపులా 500 మీటర్లలోపు మైనింగ్ చేయరాదని ఉత్తర్వులు జారీ చేసింది. భరత్పూర్ జిల్లాలోని దీగ్, కమాన్ తహసీల్లలోని పరిక్రమ మార్గ్, మతపరమైన ప్రదేశాలకు 500 మీటర్ల పరిధిలో మైనింగ్ నిషేధించాలని ప్రకటన వెలువడింది.
మతపరమైన ప్రదేశాలు, పర్వతాలలో మైనింగ్ జరగడం లేదని ప్రభుత్వం పేర్కొంది. అలాగే మైనింగ్ లీజు కూడా ఇవ్వలేదు. ఈ ప్రాంతంలో మైనింగ్ జరగడం లేదు, కానీ పరిక్రమ మార్గం నుండి 500 మీటర్ల వెలుపల మైనింగ్ కొనసాగింది. 500 మీటర్ల లోపు కూడా మైనింగ్ పనులు జరుగుతున్నాయని, పవిత్రంగా భావించే కొండలు దెబ్బతింటున్నాయని సన్యాసులు, మహర్షులు పేర్కొంటున్నారు.
అక్రమ మైనింగ్ ఆగడం లేదని సెజ్ సాధువులు ఆరోపిస్తున్నారు. బ్రజ్ ప్రాంతంలో మైనింగ్ నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ, UP మాజీ ప్రతిపక్ష నాయకుడు ప్రదీప్ మాథుర్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం 2021 ఏప్రిల్లో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ను కలిశారు. నగరం, కొండ ప్రాంతాల్లో మైనింగ్ను నిలిపివేస్తామని సీఎం చెప్పారు. ఆదిబద్రి, కంకంచల్ కొండలను పరిరక్షిస్తామన్నారు.
Source: Organiser





