
418views
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లంటినీ ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేసింది సుప్రీం కోర్టు. కేరళ, పంజాబ్, హరియాణా, పట్నా, ఉత్తరాఖండ్ హైకోర్టుల్లోనూ అగ్నిపథ్ను వ్యతిరేకిస్తూ దాఖలయ్యాయి. ఈ పెండింగ్ పిటిషన్లను ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేయాలని కోరింది. జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఆయా పిటిషన్దారులు దిల్లీ కోర్టులోనూ వాదనలు వినిపించవచ్చని స్పష్టం చేసింది.
పెండింగ్ కేసులు బదిలీ చేయకున్నా లేదా పిటిషనర్లు అభ్యంతరం తెలిపినా ఢిల్లీ హైకోర్టు నిర్ణయం తీసుకునే వరకు విచారణ ఆపాలని ఆయా కోర్టులకు చెప్పింది సుప్రీం. అగ్నిపథ్పై ఇప్పటికే పెండింగ్లో ఉన్న కేసులు సహా తాము బదిలీ చేసిన పిటిషన్లను కూడా పరిశీలించాలని ఢిల్లీ హైకోర్టుకు స్పష్టం చేసింది.
Source: EtvBharat





