
380views
కోల్కతా: మమతా బెనర్జీ ఇటీవల ఆసక్తికర కామెంట్స్ చేశారు. బీజేపీ తనను సంప్రదించి, గిరిజన వర్గానికి చెందిన ద్రౌపది ముర్ముని రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెడుతున్నామని చెప్పి ఉంటే తప్పకుండా మద్దతు ఇచ్చేదాన్ని అంటూ చేసిన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో ఓసారైనా ఎన్డీఏ తనతో చర్చించి ఉంటే బాగుండేదని అన్నారు. పైగా ద్రౌపది ముర్ముని బరిలోకి దింపటం వల్ల రాష్ట్రపతి ఎన్నికల్లో వేడి పెరిగిందని వెల్లడించారు.





