నూపుర్ శర్మ వ్యాఖ్యలకు ప్రతీకారం? బంగ్లాదేశ్లో హిందూ గర్భిణి నుపుర్ సాహా గ్యాంగ్ రేప్, హత్య!

ఢాకా: బంగ్లాదేశ్లో ఇటీవల హిందూ వివాహితపై సామూహిక అత్యాచారం, హత్య జరిగిన ఘటన సంచలనం రేపుతోంది. బంగ్లాదేశ్లో దీర్ఘకాలంగా బాధపడుతున్న హిందువులు, ఇతర మైనారిటీలపై ఇస్లామిస్ట్ హింస కొనసాగుతోంది.
తాజాగా… ఫరీద్పూర్ జిల్లా భంగా ఉపజిల్లాలోని చౌదరికాండ సదర్ది గ్రామంలోని జూట్ పొలంలో ఎన్జీవో కార్యకర్త నుపుర్ సాహా(25) మృతదేహం లభ్యమైంది. ఆమె కార్తీక్ రాయ్ భార్య. రెండు సంవత్సరాల పాప ఉంది. అంతేకాదు ఇప్పుడామె ఆరు నెలల గర్భవతి.
నుపుర్ అడ్-దిన్ అనే మైక్రోఫైనాన్స్ ఎన్జీవోకి ఫీల్డ్ వర్కర్. ఆమె మంగళవారం(జూన్ 7) ఉదయం మైక్రో-లోన్ ఇన్స్టాల్మెంట్ తీసుకోవడానికి బయటకు వెళ్ళి తిరిగి రాలేదు. బుధవారం మధ్యాహ్నం స్థానికులు మామున్ షేక్ అనే వ్యక్తి జూట్ పొలంలో అర్ధనగ్నంగా మహిళ మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు, ఫరీద్పూర్ నుండి సీఐడీ క్రైమ్ సీన్ యూనిట్ సభ్యులతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని శవపరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బాధితురాలు ఎలా చనిపోయింది అనే విషయంపై పోలీసులు మౌనంగా ఉన్నారు.
శవాన్ని చూడగానే మృగాళ్ళు అత్యాచారం చేసి జూట్ పొలంలో వదిలిపెట్టి ఉండొచ్చని భావిస్తున్నారు. ఒక బిడ్డ తల్లి, 6 నెలల గర్భిణి అయిన నూపుర్ సాహాపై అత్యాచారం, దారుణ హత్యకు పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని బంగ్లాదేశ్లోని హిందూ సమాజం డిమాండ్ చేస్తోంది. కాగా, భారతదేశానికి చెందిన నుపుర్ శర్మ వ్యాఖ్యలపై రగడ రేగిన విషయం విదితమే. అయితే, బంగ్లాదేశ్లోని ఆ హిందూ మహిళ పేరు కూడా నుపుర్గా ఉండడంతో దుండగులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
Source: HINDU POST





