
411views
న్యూఢిల్లీ: వాయుసేనలో(ఐఏఎఫ్) అగ్నిపథ్ కింద నియామకాల ప్రక్రియ ప్రారంభమైన మూడు రోజుల్లోనే 59,960 దరఖాస్తులు వచ్చాయి. అగ్నిపథ్ కింద వాయుసేన దరఖాస్తు ప్రక్రియను శుక్రవారం ప్రారంభించింది ఐఏఎఫ్. ఓ వైపు అగ్నిపథ్కు వ్యతిరేకంగా దేశంలో పలు రాష్ట్రాల్లో ఆందోళనలు జరుగుతున్న సమయంలో మూడు రోజుల్లోనే ఇన్ని దరఖాస్తులు రావడం చర్చనీయాంశంగా మారింది. రిజిస్ట్రేషన్ల ప్రక్రియ వచ్చేనెల అయిదో తేదీన ముగుస్తుందని వాయుసేన అధికారులు వెల్లడించారు. ఆసక్తి గల అభ్యర్థులు athvayu.cdac.in వెబ్సైట్లో తమ వివరాలు నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు.
Source: NationalistHub





