News

ఆప్ మంత్రికి మళ్ళీ బెయిల్ నిరాకరించిన స్పెషల్ కోర్ట్

492views

గదు అక్రమ చెలామణీ (Money laundering) కేసులో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఢిల్లీ మంత్రి సత్యేందర్‌ జైన్ కు సీబీఐ ప్రత్యేక కోర్టు బెయిల్‌ నిరాకరించింది.

కోల్ ‌కతాకు చెందిన ఓ కంపెనీకి సంబంధించి మనీలాండరింగ్‌ లావాదేవీల కేసులో మే 30న జైన్ ‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అనంతరం ఆయన్ను కోర్టులో ప్రవేశపెట్టగా జూన్‌ 9 వరకు న్యాయస్థానం ఈడీ కస్టడీకి అనుమతించింది. విచారణ కోసం మరో ఐదు రోజులు అనుమతించాలని ఈడీ కోరగా దానిని జూన్ 13 వరకు పొడిగించింది. ప్రస్తుతం ఆయన జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్నారు.

ఈ క్రమంలోనే గత మంగళవారం జైన్‌ బెయిల్ పిటిషన్ ‌పై వాదనలు విన్న స్పెషల్‌ కోర్టు న్యాయమూర్తి గీతాంజలి గోయెల్… తుది ఉత్తర్వులను జూన్ 18కి రిజర్వ్ చేశారు. నేడు బెయిల్‌ అభ్యర్థనను కొట్టివేస్తూ తీర్పు వెలువడింది. 2015-16 సమయంలో హవాలా నెట్‌వర్క్ ద్వారా జైన్‌ కంపెనీలకు.. షెల్‌ కంపెనీల నుంచి సుమారు రూ.4.81 కోట్ల వరకు ముట్టినట్లు ఈడీ తన దర్యాప్తులో గుర్తించింది. సీబీఐ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఈ హవాలా కేసు దర్యాప్తు ప్రారంభించింది. ఈ క్రమంలోనే సత్యేందర్‌, ఆయన కుటుంబానికి చెందిన రూ.4.81 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.