
459views
-
తొట్టి నిండా పళ్ల రసం.. గంపలకొద్దీ డ్రైఫ్రూట్స్
గుజరాత్లోని వడోదరలో గోవులకు పసందైన విందు అందించారు దాతలు. కజ్రాన్ మియాగం ప్రాంతం పంజ్రపోల్లోని ఓ గోశాలలో ఉన్న ఆవులకు 800 కిలోల మామిడి పళ్ల రసం, 600 కిలోల డ్రైఫ్రూట్లను ఆహారంగా ఇచ్చారు.
దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ఓ నీటి తొట్టిలో నింపిన జ్యూస్ను గోవులు తాగుతున్న దృశ్యం చూపరులను ఆకట్టుకుంటోంది.





