News

బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్‌పై పోలీసు కేసు!

414views

భాగ్య‌న‌గ‌రం: బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్‌పై హైదరాబాదులోని కంచన్ బాగ్ పోలీసులు కేసు నమోదు చేశారు. రాజస్థాన్‌లోని అజ్మీర్ దర్గా సూఫీ ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీపై రాజా సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై పోలీసులు కేసు నమోదు చేశారు. రాజా సింగ్ ఓ వీడియోలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ సూఫీ ప్రతినిధి బృందం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదును స్వీకరించిన కంచన్ బాగ్ పోలీసులు వీడియో ఆధారంగా ఘోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్‌పై కేసు నమోదు చేశారు.

రాజాసింగ్‌ ఇటీవల అజ్మీర్ దర్గాపై వ్యాఖ్యలు చేసిన వీడియో వైరల్ అయింది. తాను ఎవరి మత విశ్వాసాలను కించపర్చేలా కామెంట్స్‌ చేయలేదని రాజాసింగ్‌ అంటున్నారు. మొయినుద్దీన్‌ చిస్తీ భారతదేశాన్ని మోసం చేసిన వ్యక్తి అని ఇటీవల రాజా సింగ్ అన్నారు. మహ్మద్‌ ఘోరి భారత్‌లోకి రావడానికి మొయినుద్దీనే కారణమన్నారు రాజాసింగ్‌. హిందూ రాజు పృథ్వీరాజ్‌ చౌహన్‌ను వెన్నుపోటు పొడిచిన వ్యక్తి మొయినుద్దీన్‌ చిస్తీ లాంటి మోసగాడి సమాధి ఉన్న అజ్మీర్‌ దర్గాకు హిందువులు వెళ్ళొద్దని మాత్రమే చెప్పానంటున్నారు రాజాసింగ్‌. మొయినుద్దీన్‌ చిస్తీ హిందూ ద్రోహి అన్నారు రాజాసింగ్‌.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి