News

దేశంలో లెఫ్ట్ వింగ్ తీవ్రవాదం బాగా తగ్గింది: అమిత్ షా

505views

ప్రస్తుత ఎన్డీయే పాలనలో దేశంలో, ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలలో అవాంఛనీయ ఘటనలు తగ్గాయని, భద్రతా సిబ్బంది మృత్యువాత పడడం కూడా గణనీయంగా తగ్గిందని, అన్నిటికంటే ముఖ్యంగా దేశంలో వామపక్ష తీవ్రవాదం బాగా బలహీన పడిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు.

“ప్రధాని మోడీ నేతృత్వంలో దేశంలో లెఫ్ట్ వింగ్ తీవ్రవాదం భారీగా తగ్గింది. పదేళ్ళ కాంగ్రెస్ పాలనలో ఈశాన్య భారతంలో 8,700 అవాంఛనీయ ఘటనలు జరగ్గా బీజేపీ పాలనలో ఆ సంఖ్య 1,700కు తగ్గింది, కాంగ్రెస్ హయాంలో 304 మంది భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోతే మోడీ పాలనలో 87 మంది మాత్రమే మరణించారు అని అమిత్ షా పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.