
360views
-
అరుదైన రికార్డని వెల్లడించిన ఉత్తరాఖండ్ అధికారులు
ఉత్తరాఖండ్: ఈ ఏడాది చార్ ధామ్ యాత్ర ఆరంభం నుంచే వార్తల్లో నిలుస్తుంది. మే 3న చార్ ధామ్ యాత్ర ప్రారంభం కాగా, భక్తుల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. కేవలం నెల రోజుల్లోనే 14 లక్షల మందికి పైగా భక్తులు ఈ యాత్రకు వచ్చినట్టు ఉత్తరాఖండ్ పర్యాటకశాఖ అధికారులు వెల్లడించారు.
2019లో 7 నెలల పాటు సాగిన చార్ ధామ్ యాత్రలో 34 లక్షల మంది భక్తులు హాజరైన రికార్డు ఉంది. ఆ తర్వాత కరోనా కారణంగా రెండేళ్ళపాటు పాక్షిక యాత్ర మాత్రమే నిర్వహించారు. ఈక్రమంలో రెండేళ్ళ అనంతరం పూర్తి స్థాయిలో చార్ ధామ్ యాత్ర ప్రారంభించారు ఉత్తరాఖండ్ అధికారులు. దేశ వ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు ఈ యాత్ర కోసం పేర్లు నమోదు చేసుకోగా..ఇప్పటికే 14 లక్షల మందికి పైగా యాత్రకు వచ్చారు.