News

అసొంలో ‘బిహూ’తో క్రైస్తవ మిషనరీల మ‌త మార్పిడులు!

511views

అసొం: వెనుకబడిన వర్గాల ప్ర‌జ‌ల‌ను మ‌తం మార్చేందుకు క్రైస్తవ మిషనరీలు వివిధ ర‌కాలుగా అడ్డ‌దారులు తొక్కుతున్నాయి. తాజాగా… అసొంలో ఎంతో విలువైన‌ బిహు నృత్య సంగీతాన్ని ఎంచుకున్నాయి. ఈ క‌ళ‌తో అమాయ‌కుల‌ను మ‌భ్య‌పెడుతున్నాయి.

తేయాకు తోటలలో పనిచేసే నేపాల్, ఆదివాసీ/బన్వాసీ వర్గాల‌పై మిషనరీలు మ‌తం వ‌ల విసిరాయి. ప్ర‌ధానంగా ఆర్థికంగా వెనుకబడిన ప్రజలను లక్ష్యంగా చేసుకున్నాయి. ఈ క్రైస్తవ మత ప్రచారకులలో ఒక వర్గం బిహు క‌ళ‌ను ఎంచుకుని, అసొం సంస్కృతిని కించ‌ప‌రుస్తోంద‌ని క‌ళాకారులు తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.

సాధారణంగా యువకులు, మహిళలు ప్రదర్శించే బిహు నృత్యం అసొం దేశీయ జానపద నృత్యం. అస్సామీ సంస్కృతిలో బిహు పండుగలకు గొప్ప ప్రాముఖ్యత ఉంది. అసొంలో క్రైస్తవ మతాన్ని ప్రోత్సహించడానికి అపారమైన సాంస్కృతిక విలువ‌ల‌ను కలిగి ఉన్న ఈ నృత్యం, సంగీతాన్ని పాస్ట‌ర్లు మ‌త మార్పిడి కోసం ఉప‌యోగించుకుంటున్నారు.

క్రైస్తవులు అనేక బిహు పాటలు, సంగీతాన్ని వక్రీకరించారని, వాటి ద్వారా యేసు పేరును ప్రచారం చేస్తున్నారని అసొం క‌ళాకారులు ఆరోపించారు. బిహు పండుగలను కూడా నిర్వహిస్తున్నారు. ప్రదర్శనల సమయంలో, వారు బిహు సంస్కృతికి విరుద్ధమైన – యేసు పేరును చొప్పించిన పాటలను ప్లే చేస్తున్నార‌ని వారు ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

ఉదల్‌గురి జిల్లా నుండి కూడా ఇటువంటి ఉదంతాలు వెలుగులోకి వ‌చ్చాయి. అక్క‌డి నేపాలీ బాప్టిస్ట్ క్రిస్టియన్ అసోసియేషన్ నిర్వహిస్తున్న బిహు పండుగ తీవ్ర‌మైన ఆరోప‌ణ‌ల‌ను మూట‌క‌ట్టుకుంది. క్రిస్టియన్ అసోసియేషన్ సాంప్రదాయ అస్సామీ సంగీత వాయిద్యాలను ఉపయోగించింది. సాంస్కృతిక సంగీతాన్ని ప్లే చేస్తూ యేసును ప్రశంసించడానికి, ప్రోత్సహించడానికి భాష, సాహిత్యాన్ని మార్చేశారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.

ఇంకా, క్రైస్తవ మతాన్ని ప్రచారం చేస్తూ, సువార్తను వ్యాప్తి చేస్తూ, యేసును కీర్తిస్తూ యువతులు బిహుని ప్రదర్శిస్తున్న అనేక వీడియోలు వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో కూడా వెలువడ్డాయి. క్రిస్టియానిటీని ప్రచారం చేస్తూ, “ప్రభు”, జీసస్ క్రైస్ట్ పాటలతో రూపొందించిన బిహు వీడియోలతో యూట్యూబ్‌ కూడా నిండిపోయింది.

ఆదివాసీల‌కు డ‌బ్బు ఎర చూపి…
హిందూ వాయిస్ నివేదిక ప్రకారం, సోనాపూర్ క్రిస్టియన్ మిషనరీకి చెందిన మత ప్రచారకులు వనవాసీ(ఆదివాసీ) వర్గానికి చెందిన వారిని డబ్బు ఎర చూపి పెద్ద ఎత్తున మతమార్పిడులు చేస్తున్నారు. ఎవరైనా మత మార్పిడి కోసం డబ్బు తీసుకోవడానికి నిరాకరిస్తే, మిషనరీలు వారి పిల్లలకు ఉచిత విద్యను వాగ్దానం చేసి వారిని మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తారు.

సోనాపూర్ ప్రాంతంలోని గ్రామాల్లో గత 30 ఏళ్ళ‌లో చర్చిల సంఖ్య పెరిగింది. దురదృష్టవశాత్తు, ఈ ప్రాంతంలో క్రైస్తవ మతం విస్తరణ, ప్రజలను మార్చడానికి సువార్తికులు అనుసరించిన విషాద సంఘ‌ట‌న‌లు బ‌య‌ట ప్ర‌పంచానికి తెలియ‌డం లేదు. ఇటీవల అనేక హిందూ సంఘాలు ఈ ఆచారంపై తమ అభ్యంతరాలను వ్యక్తం చేశాయి. వారిపై ఆగ్రహం, అసంతృప్తిని వ్యక్తం చేశాయి.

Source: HINDU POST

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి