News

నేపాల్లో అదృశ్యమైన విమానం కథ విషాదాంతం

537views

* 22 మంది మృతి ?

* ప్రయాణికుల్లో నలుగురు భారతీయులు

రోజు ఉదయం నేపాల్లో అదృశ్యమైన విమానం కథ విషాదాంతం అయింది. సిబ్బంది సహా 22 మందితో ఫొఖారా నుంచి జోమ్సమ్ బయల్దేరిన తారా ఎయిర్ విమానం ఘమ్సీ ప్రాంతంలో కూలిపోయింది. ప్రమాద సమయంలో ఏర్పడిన శబ్ధాలు జోమ్సమ్ విమానాశ్రయం వరకూ వినిపించాయని ఎయిర్పోర్టు సిబ్బంది చెప్పారు. ప్రయాణికుల్లో నలుగురు భారతీయులున్నారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.