News

వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశ పరీక్షలకు హిజాబ్ ధరించి రావడంపై కర్ణాటక సర్కార్ నిషేధం

489views

రాష్ట్రంలో మెడికల్‌ మినహా వృత్తి విద్యాకోర్సుల ఎంపిక కోసం జరిగే కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (సీఈటీ)లకు విద్యార్థినులు హిజాబ్ ధరించి రావడాన్ని నిషేధించారు. రాష్ట్ర పరీక్షా ప్రాధికార సంస్థ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్‌ఎస్ఎల్‌సీ, పీయూసీ పరీక్షల్లో అమలు చేసిన తరహాలోనే హిజాబ్‌ లేకుండా పరీక్షల్లో పాల్గొనాలని ఆదేశించింది. జూన్‌ 16 నుంచి మూడు రోజుల పాటు సీఈటీలు జరగనున్నాయి. ఈ మేరకు పరీక్షా ప్రాధికార సంస్థ ఏర్పాట్లు చేస్తోంది. హైకోర్టు ఆదేశాలను సీఈటీలోనూ అమలు చేయాలని విద్యాశాఖకు సూచించింది. దీంతో పరీక్షల్లో పాల్గొనే విద్యార్థులు హిజాబ్ ‌తోపాటు ఏ విధమైన ధార్మిక భావనలు కలిగే దుస్తులు ధరించరాదని స్పష్టం చేసింది. పరీక్షా కేంద్రాలకు ఎలక్ట్రానిక్‌ వస్తువులను తీసుకురావడంపై పూర్తిగా నిషేధం ఉంటుందని, గడియారాలు, ఆభరణాలు కూడా అనుమతించేది లేదని స్పష్టం చేశారు. తాగునీరు మినహా మిగిలిన ఎటువంటి వస్తువులకైనా నిషేధం తప్పదన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.