
747views
చిత్తూరు: చిత్తూరు జిల్లా కుప్పంలో ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతరకు భక్తులు పోటెత్తారు. జాతరలో ముఖ్యమైన అమ్మవారి శిరస్సు ఊరేగింపులో పాల్గొనేందుకు.. కుప్పం పరిసర ప్రాంతాలతోపాటు కర్ణాటక, తమిళనాడు నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. మూడేళ్ళ తర్వాత జరుగుతున్న జాతర కావండంతో పెద్ద ఎత్తున హాజరయ్యారు. భక్తుల రాకతో కుప్పం పట్టణం జన సంద్రాన్ని తలపించింది. అమ్మవారి అగ్నిగుండం ప్రవేశాన్ని వైభవంగా నిర్వహించారు.





