News

ఉత్తర కాశ్మీర్లో ఉగ్రదాడి!

381views

బారాముల్లా: ఉత్తర కశ్మీర్‌లోని బారాముల్లా జిల్లా దివాన్‌బాగ్‌లోని ఓ దుకాణంపై మంగళవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు గ్రనేడ్​తో దాడి చేశారు. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు గాయపడ్డారు. క్షతగాత్రులను జిల్లా ఆస్పత్రికి తరలించారు. తాజా సమాచారం ప్రకారం ఒకరు చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ ఘటన తర్వాత.. జమ్ము కశ్మీర్ పోలీసులు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. దాడి చేసిన వారిని పట్టుకోవడానికి సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి