
520views
తిరుపతి: తిరుమలలో ఏనుగుల సంచారం కలకలం రేపింది. స్థానిక పాపవినాశనం రోడ్డులో వేకువ జామున పార్వేట మండపం వద్ద ఏనుగులు గుంపు సంచరించాయి. రోడ్డు పక్కన డివైడర్లను, పిట్ట గోడలను ధ్వంసం చేశాయి. ఏనుగులను చూసిన వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. గజరాజుల సంచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు ఘటనా సల్థాన్ని పరిశీలించారు.





