
తమిళనాడు: అంబూర్లో బిర్యానీ పండుగను జిల్లా యంత్రాంగం నిరవధికంగా వాయిదా వేసింది. మూడు రోజుల పాటు జరిగే ఈ పండగను వాయిదా వేయాలని హిందూ మున్నాని డిమాండ్ చేసింది. పండగ వాయిదా పడడంతో దీనిని వ్యతిరేకించిన స్థానిక హిందూ మున్నాని, విజయభారత్ కట్చి, ఇతరులకు విజయం చేకూరినట్లయింది.
కొన్ని రోజుల క్రితం, ఆర్గనైజర్ చెన్నై.. తమిళనాడులోని ఇతర ప్రదేశాలలో లైసెన్స్ లేని, అపరిశుభ్రమైన, హలాల్ సర్టిఫికేట్ పొంది, రోడ్డు పక్కన అర్థరాత్రి పూట విక్రయించే మొగల్ బిర్యానీ వల్ల స్థానిక వంటకాలను ఉన్న ఆదరణ తగ్గిపోతుందని నివేదించింది. ఇంకా.. వారు నాణ్యత లేని మసాలాలు, ఇతర పదార్థాలు, కుక్కలు, పిల్లులు, పశువుల నుండి కలుషితమైన, కుళ్ళిన మాంసాలను ఉపయోగిస్తున్నారని కొంతమంది ఆరోపించారు. ఈ బిర్యానీలలో మగవారి గర్భనిరోధక మాత్రలు కలిపి నపుంసకులను చేస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.
ఆ పండగ ఏమిటంటే…
అంబూర్ ట్రేడ్ సెంటర్లో ఈ నెల 13(నేడు) నుంచి 15 వరకు సాయంత్రం అయిదు గంటల నుంచి ఎనిమిది గంటల మధ్య మూడు రోజుల పాటు అంబూర్ బిర్యానీ తిరువిజా-2022 (బిర్యానీ పండుగ)ను తొలిసారిగా నిర్వహించనున్నట్టు కలెక్టర్ అమర్ కుష్వాహ తెలిపారు. పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు దీనిని నిర్వహిస్తున్నామని, బిర్యానీకి పర్యాయపదంగా ఉన్న అంబూర్లో ఈ వేడుకను తిరుపత్తూరు జిల్లా యంత్రాంగం నిర్వహిస్తుందని ఆయన చెప్పారు.
“సందర్శకులకు ప్రవేశ రుసుము లేదు. పొరుగు జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో సందర్శకులు ఈ ఉత్సవాలకు హాజరయ్యే అవకాశం ఉంది. దాదాపు 30 నుంచి 50 బిర్యానీ స్టాల్స్ ఏర్పాటు చేస్తాం’’ అని కలెక్టర్ అధికారులతో పండుగ సందర్భంగా నిర్వహించిన సమీక్షా సమావేశంలో చెప్పారు.
మేము పండుగను డాక్యుమెంట్ చేసి ప్రభుత్వానికి సమర్పించినట్టయితే జిల్లా అంబూర్ బిర్యానీకి ‘జియోగ్రాఫికల్ ఇండికేషన్’ (జిఐ) ట్యాగ్ని పొందగలదని కుష్వాహా చెప్పారు, స్పెయిన్లోని టొమాటో పండుగ, రాజస్థాన్ పుష్కరాలు ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షిస్తాయి. అలాగే, బిర్యానీ పండుగ కూడా తిరుపత్తూరుకు పేరు తెచ్చిపెడుతుంది”… అని కలెక్టర్ అన్నారు.
పండగను బహిష్కరించాలి
వేలూరు డివిజన్ హిందూ మున్నాని అధినేత మహేశ్ మాట్లాడుతూ పండుగ నిర్వహించడం శ్రేయస్కరం కాదని హెచ్చరించారు. బిర్యానీ ఫలానా మతానికి చెందిన ఆహారం కాబట్టి ప్రభుత్వం ఇలాంటి మేళాలను నిర్వహించకూడదని అన్నారు. కలెక్టరు అటువంటి పండుగను నిర్వహించడంలో మునిగిపోకూడదు.
పండుగను బహిష్కరించాలని హిందూ మున్నాని ప్రజలకు విజ్ఞప్తి చేసింది. విజయ భారత మక్కల్ కట్చి అధ్యక్షుడు జైశంకర్ మాట్లాడుతూ అంబూర్ తోలు పరిశ్రమకు ప్రసిద్ధి చెందిందని, దీనిని ప్రోత్సహించాలని, ఫలితంగా ఉపాధి కల్పనతోపాటు ఈ ప్రాంత ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతుందన్నారు. బిర్యానీ పండగ నిర్వహించడం వల్ల ఎవరికీ ఉపయోగం ఉండదు. మత ఘర్షణలకు ఆస్కారం ఉంటుందని హెచ్చరించారు. మొత్తమ్మీద పలువురి నిరసనల మధ్య, కలెక్టర్ కుష్వాహా బిర్యానీ పండుగను వర్షాల కారణంగా వాయిదా వేసినట్టు ప్రకటించారు.
Source: Organiser





