News

3 దశాబ్దాల భారత రాజకీయ అస్థిరతకు ముగింపు

672views
  • జర్మనీలోని ప్రవాస భారతీయులతో మోడీ

న్యూఢిల్లీ: ఒక్క బటన్ నొక్కడం(ఓటు వేయడం) ద్వారా మూడు దశాబ్దాల రాజకీయ అస్థిరతకు భారత్​ చరమగీతం పాడింద‌ని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఐరోపా పర్యటనలో భాగంగా జర్మనీ రాజధాని బెర్లిన్​లో ప్రవాస భారతీయులతో సమావేశం సందర్భంగా ఈ మేరకు వ్యాఖ్యానించారు. తాను బెర్లిన్​కు వచ్చింది తన గురించి లేదా తన ప్రభుత్వం గురించి మాట్లాడటానికి కాదని అన్నారు.

ప్రభుత్వ పాలనలో సాంకేతిక పరిజ్ఞానాన్ని సమ్మిళితం చేయడం ద్వారా సరికొత్త భారత్‌ అవిష్కృతమైందని, దృఢమైన రాజకీయ సంకల్పానికి ఇది నిదర్శనంగా నిలుస్తోందని ప్రధాని మోదీ తెలిపారు. భారతదేశ ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం కల్పించడంలో సహకారమందించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. 2014 వరకు భారత్‌లో 200 నుంచి 400 వరకు మాత్రమే అంకుర సంస్థలు(స్టార్టప్స్‌) ఉండగా నేడు వాటి సంఖ్య 68 వేలకు చేరిందని తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి