News

యూపీలో అక్రమ లౌడ్ స్పీకర్లు, హోరు త‌గ్గుతోంది…

515views

లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మతపరమైన ప్రదేశాల‌లో చట్టవిరుద్ధంగా లౌడ్‌స్పీకర్లు ఏర్పాటు చేసిన వారిపైనా, శబ్ద పరిమితి ప్రమాణాలను ఉల్లంఘించేవారిపై చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హోం శాఖ చెప్పిన కొన్ని రోజుల తరువాత దేవాలయాలు, మసీదులు, గురుద్వారాలకు సమాచారం ఇస్తున్నట్టు పోలీసులు తెలిపారు. చర్చిలు, కల్యాణ మండపాల వారికి ప్ర‌భుత్వ మార్గదర్శకాలను అనుసరించమని వారికి ఆదేశాలు జారీ చేశామ‌ని పేర్కొన్నారు.

అటువంటి అన్ని స్థలాల జాబితాను రూపొందించి, ఈ నెల 30లోగా హోం శాఖకు వారి నివేదికలను పంపాలని డిపార్ట్‌మెంట్ పోలీసు స్టేషన్‌లను ఆదేశించింది. రాష్ట్రంలోని మతపరమైన ప్రదేశాల్లో అక్రమ లౌడ్ స్పీకర్లను తొలగించాలని శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు సంబంధించి జిల్లాల నుంచి ఏప్రిల్ 30లోగా సమ్మతి నివేదికను కోరింది.

“కోర్టు, ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి, శబ్ద కాలుష్యానికి సంబంధించి అందరికీ సమాచారం అందించబడుతోంది. ఈ సమాచారం అన్ని దేవాలయాలు, మసీదులు, గురుద్వారాలు, చర్చిలు, క‌ల్యాణ మండపాలకు అందించబడుతుంది. ప్రజలు మార్గదర్శకాలను పాటిస్తున్నారు” అని లక్నో ఏసీపీ కైసర్‌బాగ్ యోగేష్ కుమార్ అన్నారు.

అదే సమయంలో, ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్ జిల్లా వ్యాప్తంగా 683 లౌడ్‌స్పీకర్లు తీసివేయబడ్డాయి. పారామితుల ప్రకారం 395 లౌడ్ స్పీకర్ల వాల్యూమ్ తగ్గించబడింది.

“పోలీసులు/పరిపాలన విజ్ఞప్తి మేరకు, ప్రజలు దేవాలయాలు/మసీదులు/మత స్థలాల నుండి స్వచ్ఛందంగా లౌడ్ స్పీకర్లను తీసివేశారు. జిల్లావ్యాప్తంగా 683 లౌడ్‌స్పీకర్లను తొలగించామని, పారామితుల ప్రకారం 395 లౌడ్ స్పీకర్ల వాల్యూమ్ తగ్గించామని సీతాపూర్ పోలీసులు తెలిపారు. సుప్రీంకోర్టు జూన్ 2005 ఆదేశం ప్రకారం… రాత్రి 10 గంటల మధ్య బహిరంగంగా లౌడ్ స్పీకర్లు, మ్యూజిక్ సిస్టమ్‌లను ఉపయోగించడాన్ని నిషేధించింది.

Source: Organiser

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి