
-
అమిత్ షాకు ఎంఎన్ఎస్ లేఖ
ముంబై: మసీదుల్లో లౌడ్ స్పీకర్లను తొలగించాలని డిమాండ్ చేస్తూ మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎంఎన్ఎస్) శుక్రవారం న్యూఢిల్లీలోని కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు లేఖ రాసింది. మసీదుల్లో లౌడ్ స్పీకర్లను తొలగించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించేలా, రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడుతూ కేంద్రం చర్యలు తీసుకోవాలని, మసీదుల నుంచి లౌడ్ స్పీకర్లను తొలగించేలా మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని నాసిక్ ఎంఎన్ఎస్ జిల్లా అధ్యక్షుడు అంకుష్ పవార్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు రాసిన లేఖలో డిమాండ్ చేశారు.
కాగా, మసీదులపై ఉన్న లౌడ్ స్పీకర్లను మే మూడోతేదీ నాటికి తొలగించాలంటూ మహారాష్ట్ర ప్రభుత్వానికి ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ థాకరే గతంలో అల్టిమేటం ఇచ్చారు. మే మూడోతేదీ నాటికి మసీదులపై లౌడ్ స్పీకర్లను శివసేన ఆధ్వర్యంలోని సర్కారు తొలగించకపోతే మసీదుల ముందు మహారాష్ట్ర నవనిర్మాణ సేన కార్యకర్తలు హన్ మాన్ చాలీసా పారాయణం వినిపిస్తారని తాజాగా ప్రకటించారు రాజ్ థాకరే.
ఎంఎన్ఎస్ కార్యకర్తలు మసీదుల వెలుపల స్పీకర్లను అమర్చి హనుమాన్ చాలీసా ప్లే చేస్తారని రాజ్ థాకరే మహా వికాస్ అఘాడి (ఎంవీఏ) ప్రభుత్వాన్ని హెచ్చరించారు. థాకరే ఈ సమస్యను సామాజిక సమస్యగా పేర్కొన్నారు. తాను ఈ అంశంపై వెనక్కి తగ్గబోనని, అదే సమయంలో మీరు ఏమి చేయాలనుకుంటే అది చేయండి అని శివసేన ప్రభుత్వానికి సవాలు విసిరారు.
మసీదులపై దాడులు చేయండిః ప్రభుత్వానికి విజ్ఞప్తి
అంతేకాకుండా.. ముంబైలోని ముస్లిం ప్రాంతాల్లోని మసీదులపై దాడి చేయాలని ప్రధాని నరేంద్ర మోదీకి రాజ్ థాకరే విజ్ఞప్తి చేశారు. చాలా ప్రాంతాల్లో “పాకిస్తానీ మద్దతుదారులు” ఉన్నారని అన్నారు.
“ముస్లింల ఇళ్లలోనూ.. మదరసాలపైనా దాడులు చేయాలని నేను ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ ప్రాంతాల్లో పాకిస్థానీ మద్దతుదారులు నివసిస్తున్నారు. అక్కడ ఏమి జరుగుతుందో ముంబై పోలీసులకు తెలుసు.. మన ఎమ్మెల్యేలు వారిని ఓటు బ్యాంకు కోసం ఉపయోగిస్తున్నారు, అలాంటి వారికి ఆధార్ కార్డ్ కూడా లేదు. కానీ కొందరు ఎమ్మెల్యేలు వాటిని తయారు చేయిస్తున్నారు” అని రాజ్ థాకరే అన్నారు.
Source: NationalistHub





