
-
దేశాన్ని వీడిన ఇమ్రాన్ భార్య బెస్ట్ ఫ్రెండ్
ఇస్లామాబాద్: పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఇప్పటి వరకూ రాజకీయంగా షాకుల మీద షాకులు తగులుతూ ఉండగా, తాజాగా అతడి కుటుంబానికి సన్నిహితంగా ఉన్న వాళ్ళు పాకిస్తాన్ను వీడి వెళుతూ ఉండడంతో ఇమ్రాన్ ఖాన్కు మరిన్ని చిక్కులు మొదలయ్యాయి.
ఇమ్రాన్ ఖాన్ భార్య బుష్రా బీబీ సన్నిహితురాలు ఫరా ఖాన్ పాకిస్తాన్ను విడిచివెళ్ళిపోయిందని స్థానిక మీడియా పేర్కొంది. ఇమ్రాన్ కుటుంబంతో ఉన్న సాన్నిహిత్యాన్ని అడ్డుపెట్టుకుని ఫరా ఖాన్ భారీ మోసాలకు పాల్పడడమే కాకుండా.. పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేశారని మీడియా ఆరోపించింది. ఫరా ఖాన్ 32 మిలియన్ డాలర్ల కుంభకోణానికి పాల్పడ్డారని పాక్ విపక్షాలు విమర్శిస్తూ ఉన్నారు.
పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అధికారాన్ని చేజిక్కించుకోవాలని ప్రయత్నిస్తూ ఉండగా, కొత్త ప్రభుత్వం ఏర్పాటైతే ప్రతీకారం తీర్చుకుంటారనే భయంతో ఆయన సన్నిహితులు విదేశాలకు పారిపోవడం ప్రారంభించారు. ఫరా ఖాన్ భర్త అహ్సన్ జమీల్ గుజ్జార్ ఇప్పటికే అమెరికా వెళ్ళిపోయారు.
ఫరా ఖాన్ ఆదివారం దుబాయ్కు వెళ్ళిపోయిందని ఎక్స్ప్రెస్ ట్రిబ్యూన్ వార్తాపత్రిక నివేదించింది. ఇమ్రాన్ ఖాన్పై అవిశ్వాస తీర్మానాన్ని నేషనల్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ తిరస్కరించిన తర్వాత పాకిస్థాన్లో నెలకొన్న రాజకీయ గందరగోళం మధ్య ఈ పరిణామం చోటు చేసుకుంది.
Source: NationalistHub
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.





