News

ట్విట్ట‌ర్‌ను నిల‌దీసిన ఢిల్లీ హైకోర్టు

583views

న్యూఢిల్లీ: సున్నిత అంశంపై ఢిల్లీ హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. హిందూ దేవుళ్ళ‌పై అభ్యంతరకర కంటెంట్‌ పోస్ట్‌ చేసేవాళ్ళ‌పై స్వచ్ఛందంగా చర్యలు ఎందుకు తీసుకోవట్లేదని ట్విటర్‌ను నిలదీసింది. ఈ క్రమంలో మైక్రోబ్లాగింగ్‌ సైట్‌కు చురకలు అంటించింది.

‘AtheistRepublic’ అనే ట్విటర్‌ పేజీలో కాళిమాతకు వ్యతిరేకంగా కొన్ని పోస్టులు కనిపించాయి. దీంతో ట్విటర్‌ ఆ అకౌంట్‌ను బ్లాక్‌ చేయాలంటూ పిటిషన్‌ దాఖలైంది. సోమవారం ఢిల్లీ హైకోర్టులో ఈ పిటిషన్‌పై వాదనలు జరిగాయి. అయితే అమెరికాకు అధ్యక్షుడిగా పని చేసిన డొనాల్డ్‌ ట్రంప్‌ విషయంలో ట్విటర్‌ అనుసరించిన తీరును ఈ సందర్భంగా గుర్తు చేసింది ఢిల్లీ హైకోర్టు. ఇలా హిందూ దేవుళ్ళ‌పై అభ్యంతరకర పోస్టులు చేసేవాళ్ళ‌ అకౌంట్లను ఎందుకు బ్లాక్‌ చేయడం లేదంటూ, చర్యలు తీసుకోవడం లేదంటూ ప్రశ్నించింది. అలాగే ఇతర ప్రాంతాల, జాతుల ప్రజల సున్నితత్వాల గురించి ట్విట్టర్ పట్టించుకోవడం లేదంటూ ఢిల్లీ హైకోర్టు ఆక్షేపించింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి