News

ప్రపంచమంతా తేరుకున్నా.. చైనాను వీడ‌ని కరోనా

451views

న్యూఢిల్లీ: చైనా దేశంలోని అతిపెద్ద నగరమైన షాంఘైలో 3,500 కొవిడ్ కేసులు వెలుగు చూడటంతో ఆ నగరంలో లాక్ డౌన్ విధించారు. షాంఘైలో ఒక్క రోజే 3,500 కొవిడ్-19 కేసులు నమోదయ్యాయి. వాటిలో చాలా వరకు ఎలాంటి లక్షణాలు లేని కరోనా కేసులు. ఇప్పుడు, చైనా అతిపెద్ద నగరమైన షాంఘైలో వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి రెండు దశల లాక్‌డౌన్ విధించారు.

చైనా దేశంలో ఈ నెలలో దేశవ్యాప్తంగా 56,000 కంటే ఎక్కువ కరోనా కేసులు బయటపడ్డాయి. దీంతో కరోనా పరీక్షలు ముమ్మరం చేశారు. 26 మిలియన్ల జనాభా ఉన్న షాంఘై నగరంలో రెండు దశల లాక్‌డౌన్‌ను ప్రారంభించింది. చైనాలో కొత్త నిబంధనల ప్రకారం వంతెనలు, సొరంగాలను మూసివేశారు.

184 కోట్ల మందికి కొవిడ్ వ్యాక్సిన్‌లు వేశారు. పబ్లిక్ సర్వీస్‌లను అందించే సంస్థలు, ఆహారాన్ని సరఫరా చేసే సంస్థలు మినహా అన్నీ ఫ్యాక్టరీలలో పనిని నిలిపివేయాలని కూడా ఆదేశించారు. కార్యాలయాలు, అన్ని వ్యాపార సంస్థలను మూసివేశారు. వాహనాల రాకపోకలను నిలిపివేశారు. షాంఘైలోని డిస్నీల్యాండ్ థీమ్ పార్క్‌ను ముందుగా మూసివేశారు. వాహన తయారీ సంస్థ టెస్లా కూడా ఉత్పత్తిని నిలిపివేసింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి