News

ఘనంగా ప్రారంభమైన గవిమఠం బ్రహ్మోత్సవాలు

489views

అనంతపురం: జిల్లాలోని ఉరవకొండలో ప్రసిద్ధిగాంచిన గవిమఠం బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇవాళ సాయంత్రం బ్రహ్మరథోత్సవం జ‌ర‌గ‌నుంది. మన రాష్ట్రంతో పాటు కర్ణాటక నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో మఠానికి పోటెత్తుతున్నారు.

చరిత్ర

గవిమఠం సంస్థానానికి శతాబ్దాల చరిత్ర ఉంది. సహజంగా వెలిసిన చంద్రమౌళీశ్వరుడు గవిలో పూజలు అందుకుంటుండటంతో ఇది గవిమఠంగా పేరొందింది. ఈ మఠం 770 ఉపమఠాలకు ప్రధాన వేదిక. శైవమతం కోసం కరిబసవ రాజేంద్రస్వామి గవిమఠాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం మఠానికి ఎనిమిదో పీఠాధిపతిగా చెన్నబసవ రాజేంద్రస్వామి కొనసాగుతున్నారు. ఉత్తరాధికారిగా డాక్టర్ రాజేంద్రస్వామి వ్యవహరిస్తున్నారు. మఠం కేవలం ఆధ్యాత్మిక కార్యక్రమాలకు పరిమితమవకుండా సామాజిక సేవలోనూ ముందుంది.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి