
-
ఏర్పాట్లను పరిశీలించిన తితిదే అధికారులు
కడప: ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయంలో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు, స్థల పరిశీలన, కల్యాణవేదిక వద్ద జరుగుతున్న పలు అభివృద్ధి పనులను తితిదే అధికారులు పరిశీలించారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ఇంజినీరింగ్, ఆలయ అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా జెఈవో మీడియాతో మాట్లాడుతూ ఏప్రిల్ 10 నుండి 18వ తేదీ వరకు ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నట్టు తెలిపారు. ఇందులో భాగంగా ఏప్రిల్ 15వ తేదీ రాత్రి 8 నుండి 10 గంటల వరకు సీతారాముల కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహిస్తామన్నారు.
ఏప్రిల్ 19న పుష్పయాగం జరుగతుందన్నారు. వేలాదిగా వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పారిశుద్ధ్య నిర్వహణ, షెడ్లు, మంచినీరు, అన్నప్రసాదాలపై పంపిణీపై అధికారులతో చర్చించినట్టు తెలిపారు. కల్యాణ వేదిక వద్ద జరుగుతున్న అభివృద్ధి పనలును త్వరిత గతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.





