
507views
జమ్ము కశ్మీర్: జమ్ము కశ్మీర్లో శ్రీనగర్ శివారులో ఓ సర్పంచ్ను తీవ్రవాదులు కాల్చి చంపారు. నిషేధిత లష్కరే తొయిబా అనుబంధ సంస్థ అయిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్(టీఆర్ఎఫ్) ముష్కరులు ఈ ఘటనకు బాధ్యత ప్రకటించుకున్నారు. మరణించిన సర్పంచ్ను సమీర్ భట్గా గుర్తించారు. భట్కు పోలీసులు ముందు నుంచీ భద్రత కల్పిస్తున్నారు. శ్రీనగర్లోని ఓ హోటల్లో బస చేస్తున్న ఆయన బుధవారం ఎవరికీ తెలియకుండా బయటకు వెళ్లారు. ఇదే సమయంలో ఉగ్రవాదులు నగర శివారులోని ఖాన్మోహ్ ప్రాంతంలో దాడి చేశారు. గాయపడ్డ సర్పంచ్ను ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారని పోలీసులు తెలిపారు. ఘటనాస్థలిని పరిశీలించిన తర్వాత.. నిందితుల కోసం గాలింపు ప్రారంభించినట్టు వెల్లడించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు సాగిస్తున్నట్టు చెప్పారు.





