News

గ్రామీణుల కోసం కేంద్రం డిజిసాథి

532views
  • ఇంటర్నెట్ లేకపోయిన డిజిటల్ చెల్లింపులకు అవకాశం

న్యూఢిల్లీ: స్మార్ట్​ఫోన్​ లేని ప్రజలు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల వారు యూపీఐ ఆధారిత నగదు లావాదేవీలు జరుపుకొనేందుకు వీలుగా ఈ సేవల్ని డిజిసాథిని తీసుకొచ్చినట్టు ఆర్​బీఐ గవర్నర్​ శక్తికాంత దాస్​ తెలిపారు.

గ‌త మూడేళ్ళుగా డిజిటల్​ చెల్లింపులకు ఊతం ఇచ్చేందుకు ఆర్​బీఐ విశేషంగా కృషిచేసిందని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలోనే సైబర్​ సెక్యూరిటీపై దృష్టి సారించాలని, ఎలాంటి ప్రతికూలతలు తలెత్తకుండా అన్నింటికీ సిద్ధపడేలా వ్యవస్థను రూపొందించాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు.డిజిటల్​ చెల్లింపుల కోసం ‘డిజిసాథీ’ 24×7 హెల్ప్​లైన్​ను కూడా ఆవిష్కరించారు.

యూపీఐ చెల్లింపులు 2016లోనే వచ్చినా ఇది స్మార్ట్​ఫోన్లకే పరిమితమైంది. గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు, వృద్ధులు చాలా వరకు ఫీచర్​ ఫోన్లను వాడుతున్నారు. ఈ నేపథ్యంలోనే వారి అవసరాల కోసం.. ఆ తరహా మొబైల్స్​లోనూ యూపీఐ పేమెంట్స్​ చేసుకునేందుకు వీలుగా కేంద్ర బ్యాంకు ఈ నిర్ణయం తీసుకుంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి