News

పాకిస్థాన్​కు షాక్​.. జూన్​ వరకు గ్రే లిస్ట్​కే పరిమితం!

389views

న్యూఢిల్లీ: ప్రపంచ మనీలాండరింగ్‌, టెర్రర్‌ ఫైనాన్సింగ్‌ నిఘా సంస్థ (ఎఫ్​ఏటీఎఫ్)​ పాకిస్థాన్‌ను జూన్‌ వరకు గ్రే జాబితాలోనే కొనసాగించనున్నట్టు సమాచారం. నిర్దేశిత లక్ష్యాలను చేరుకోనందున ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు తెలుస్తోంది. ఈ మేరకు మీడియా కథనాలు వెలువడ్డాయి. ఉగ్రవాద కార్యకలాపాలకు ఆర్థికసాయం అందకుండా చర్యలు తీసుకోవటంలో విఫలమైనందున 2018 జూన్‌ నుంచి పాకిస్థాన్‌ ఎఫ్​ఏటీఎఫ్ గ్రే జాబితాలో కొనసాగుతుంది.

2019 అక్టోబర్‌ వరకు 27 పాయింట్ల యాక్షన్ ప్లాన్‌ పూర్తి చేయాలన్న ఎఫ్​ఏటీఎఫ్ ఆదేశాలను చేరుకోవటంలో పాకిస్థాన్​ విఫలమైంది. ఎఫ్​ఏటీఎఫ్ ప్లీనరీ సమావేశాలు శుక్రవారంతో ముగుస్తాయి. ఎఫ్​ఏటీఎఫ్… మనీ లాండరింగ్‌, టెర్రర్‌ ఫైనాన్స్‌ను ఎదుర్కొనే 2021 యాక్షన్‌ ప్లాన్‌ను 2023 జనవరి వరకు పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి