
వెల్లూరు(తమిళనాడు): అక్కడి వారికి మతోన్మాదం అవహించింది… అంతే… అను’మతి’లేకపోయినా మసీదు ఉండాల్సిందేనని ఊగిపోయారు. ఫలితం.. ఓ జ్యూస్ దుకాణం రాత్రికి రాత్రే మసీదుగా మారిపోయింది. ఈ సంఘటన వెల్లూరులోని గాంధీ రోడ్లోని సర్కార్ మండి వీధిలో చోటుచేసుకుంది. ఈ వ్యవహారాన్ని తెలుసుకున్న హిందూ మున్నానీ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు.
మసీదును అక్రమంగా నిర్మించారని ఆరోపించారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ వివాదాస్పద స్థలానికి 100 మీటర్ల దూరంలో మూడు దేవాలయాలు ఉన్నాయని, భవిష్యత్లో అవాంఛనీయ సంఘటనలు జరిగే అవకాశం ఉందని హిందువులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో పెరంబలూరులో అనుభవించినట్టుగా హిందూ దేవతల ఊరేగింపులను అడ్డుకునే పరిస్థితులు ఏర్పడతాయని పోలీసులు తెలిపారు.
ఆ జ్యూస్ దుకాణ భవనం ఒక వ్యాపారికి చెందినదని, ఇటీవల పునరుద్ధరించి, మసీదు అని బోర్డు పెట్టినట్టు పోలీసులు తెలిపారు. సరైన అనుమతులు లేకుండా అకస్మాత్తుగా ఒక మతపరమైన నిర్మాణాన్ని ఎలా నిర్మిస్తారని హిందూ మున్నాని ప్రశ్నించింది. ఈ ప్రాంతంలో మతపరమైన ఉద్రిక్తతలను నిరోధించాలని కలెక్టర్కు వినతిపత్రం ఇచ్చింది.
హిందూ మున్నాని నాయకుడు ఆర్. మణిస్వామి మాట్లాడుతూ, “సరైన డాక్యుమెంటేషన్ లేకుండా వాణిజ్య ఆస్తులను అకస్మాత్తుగా మసీదుగా మారుస్తున్నారని, మేము ఇప్పటికే కలెక్టర్కు పిటీషన్ చేసాము. అంతేకాకుండా, 100 మీటర్ల పరిధిలో మూడు ఆలయాలు ఉన్న ప్రదేశంలో మసీదు వస్తోంది. మా ఆలయ ఊరేగింపులు ఈ ప్రాంతం గుండా వెళతాయని, ఈ దృష్ట్యా భవిష్యత్తులో ఇది తీవ్ర ఘర్షణకు దారి తీస్తుంది’ అని హెచ్చరించారు.
Source: Hindupost





