
న్యూఢిల్లీ: పాకిస్తానీ కార్యకర్త మలాలా యూసఫ్జాయ్ కర్నాటకలోని ముస్లిం బాలికలు బురఖా ధరించి తరగతులకు హాజరు కావాలనే డిమాండ్కు మద్దతు పలికింది.
“కళాశాల మమ్మల్ని చదువు, హిజాబ్ ఎంచుకోమని బలవంతం చేస్తోంది’… అని మంగళవారం (ఫిబ్రవరి 8) మలాలా ట్వీట్ చేసింది. ఇంకా హిజాబ్ ధరించిన ఆడపిల్లలను పాఠశాలకు వెళ్లనివ్వకపోవడం దారుణం… భారత నాయకులు ముస్లిం మహిళలను అణగదొక్కడాన్ని ఆపాలి…. అని రాసింది.
అయితే,
బురఖా అణచివేతకు చిహ్నమని నిర్ద్వందంగా చెప్పిన ఆమె సొంత రాతలు, ప్రసంగాలను నెటిజన్లు ఆమెకు ఈ సందర్భంగా గుర్తు చేశారు. తన పుస్తకం ‘ఐ యామ్ మలాలా’లో, ఆమె ఇలా రాసింది. “వారు స్త్రీలను బురఖాలు ధరించమని బలవంతం చేశారు. బురఖా ధరించడం అనేది పెద్ద ఫాబ్రిక్ షటిల్ కాక్లో నడవడం వంటిది. చూడటానికి గ్రిల్ మాత్రమే ఉంటుంది. వేడి రోజులలో అది ఓవెన్ లాగా ఉంటుంది. కనీసం నేను ధరించాల్సిన అవసరం లేదు’ అన్న మాటలను గుర్తు చేశారు.
మలాలా ట్వీట్కి పలువురి స్పందనలు..
1. ఏ విద్యా సంస్థలోనూ బురఖాకు స్థానం ఉండదని రాజకీయ వ్యాఖ్యాత అదితి పట్వర్ధన్ అన్నారు. మలాలా ట్వీట్ను ఉటంకిస్తూ, పట్వర్ధన్ ఇలా రాశారు.. “మీరు ఎందుకు పాకిస్తాన్కు తిరిగి వెళ్లకూడదు? మీరు మొదట ఎందుకు వెళ్లిపోయారో గుర్తుంచుకోండి? హిజాబ్/బుర్కాకు విద్యా సంస్థలో ఎటువంటి స్థానం లేదు. దీన్ని ధరించాలనుకునే వారు ఎలాంటి డ్రెస్ కోడ్ను పాటించని సంస్థకు వెళ్లాలి. .”
2. మలాలా కపటత్వాన్ని బట్టబయలు చేస్తూ, పాకిస్థాన్లో హిందువులు, సిక్కులను బలవంతంగా మతమార్పిడి చేయడం గురించి ఆమె ఎప్పుడూ మాట్లాడలేదని బీజేపీ నేత మంజీందర్ సింగ్ సిర్సా అన్నారు. ఒక ట్విట్టర్ పోస్ట్లో… “విచిత్రం! పాకిస్తాన్లో మైనర్ హిందువులు, సిక్కు బాలికలను బలవంతంగా మతమార్పిడి చేయడం వంటి ఇతర ముఖ్యమైన అంశాలపై మలాలా ఎప్పుడూ మాట్లాడలేదు… కానీ, ఈ రోజు ఆమె వాస్తవాలను తెలుసుకోకుండా ట్వీట్ చేస్తోంది!!”
3. మలాలా తన సోషల్ మీడియా పోస్ట్ ద్వారా ఇస్లామిక్ జిహాదీ ఎజెండాను నడుపుతోందని బీజేపీ నేత కపిల్ మిశ్రా ఆరోపించారు. “హిజాబ్ ధరించనందుకు ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, పాకిస్తాన్లలో ముస్లిం బాలికలు చంపబడ్డారు. హిందూ, సిక్కు బాలికలు కేవలం హిందువుగా ఉన్నందుకు పాకిస్తాన్లో చంపబడ్డారు. ఆమె అసలు సమస్యలపై ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇక్కడ ఆమె రాడికల్ ఇస్లామిక్ జిహాదీ ఎజెండాను నడుపుతోంది.”
కాగా, అక్టోబర్ 9, 2012న, బాలికల విద్య కోసం ప్రచారం చేసినందుకు పాకిస్తాన్లోని స్వాత్ జిల్లాలో బస్సులో పాకిస్తాన్ తాలిబాన్లు మలాలా తలపై కాల్చారు. ఆమె యునైటెడ్ కింగ్డమ్కు వెళ్లి అక్కడే ఉంటోంది. ఆమెకు 2014లో నోబెల్ శాంతి బహుమతి లభించింది.
ఇంకా..
ముస్లిం మహిళలు, బురఖా గురించి బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన విషయాన్ని నెటిజన్లు ఆమెకు గుర్తు చేశారు. డాక్టర్ అంబేద్కర్ ఇలా రాశారు… “వారు ఇతర వర్గాల వారి సోదరీమణుల కంటే వెనుకబడి ఉంటారు. ఏ బహిరంగ కార్యకలాపాలలో పాల్గొనలేరు. బానిస మనస్తత్వం, న్యూనతా కాంప్లెక్స్తో బరువుగా ఉన్నారు.”
మలాలా అల్ ఖైదా/ఐసిస్/తాలిబాన్లో చేరాలని ఆలోచిస్తోందా?
న్యూస్ యాంకర్, ఎడిటర్ ఆనంద్ నరసింహన్ మాట్లాడుతూ మలాలా అల్ ఖైదా/ఐసిస్/తాలిబాన్లో చేరాలని ఆలోచిస్తోందా? ట్విటర్ పోస్ట్లో, అతను ఇలా రాశారు… “ఇది హిజాబ్తో మొదలై, అది ప్రత్యేక తరగతి గదులుగా, చివరకు బాలికలకు పాఠశాలలు లేకుండా అభివృద్ధి చెందుతుంది… ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్లలో మనం దీనిని చూడలేదా? మలాలా ఈ ఆలోచనకు బాధితురాలు కాదా? పురోగతి ఉందా? లేదా ఆమె తన నోబెల్ను తిరిగి ఇచ్చి అల్ ఖైదా/ఐసిస్/తాలిబాన్లో చేరాలని ఆలోచిస్తున్నారా?
జర్నలిస్ట్ ఆదిత్య రాజ్ కౌల్ ….
బురఖాను డిమాండ్ చేసే మహిళలను ఒక సమస్యగా పేర్కొంటూ, జర్నలిస్ట్ ఆదిత్య రాజ్ కౌల్ మాట్లాడుతూ, తరగతి గదులలో బురఖాను సమర్ధించే వారు మహిళల అణచివేతను పట్టించుకోవడం లేదు… జీవితంలో ఎప్పుడూ హిజాబ్ను ముట్టుకోని వారు నేడు భారతదేశంలోని పాఠశాల/కాలేజీలకు వెళ్లే ముస్లిం బాలికల హిజాబ్ను సమర్ధిస్తున్నారు. అసలు మీరే సమస్య! మీరు ముస్లింలపై అణచివేతను ప్రోత్సహిస్తున్నారు… రాడికల్స్కు సాధికారత కల్పిస్తున్నారు’’ అని ఆయన ట్విట్టర్ పోస్ట్లో పేర్కొన్నారు.
Source: Organiser





