
673views
-
ప్రారంభించిన పరిపూర్ణానందస్వామి
శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం మడపం గ్రామం వద్ద దేశంలోనే ఎత్తైన 180 అడుగుల వీర హనుమాన్ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. వంశధార నది ఒడ్డున ఏర్పాటు చేసిన ఈ విగ్రహం భక్తులకు కనువిందు చేస్తోంది.
ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. పరిపూర్ణానంద స్వామి విగ్రహాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకుడు రామ్ మాధవ్, ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ పలువురు ఆధ్యాత్మికవేత్తలు పాల్గొన్నారు.





